Saturday, December 4, 2010

మైక్రో నూట్రియంట్ల ప్రాధాన్యం -ఆరోగ్యము , Micro-nutrients and health



సూక్ష్మ పోషకాలు --

    మన శరీరానికి అతి సూక్ష్మమైన మోతాదులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలను 'సూక్ష్మ పోషకాలు ' అంటారు. వ్యాధులతో పోరాడటానికి, అంటు వ్యాధులు రాకుండా ఉండటానికి సూక్ష్మ పోషకాలు అవసరం. అంతేగాక మనం తీసుకొనే అహారం చక్కగా జీర్ణమై, శక్తిని యివ్వడానికి ఇవి తోడ్పడతాయి. ఆరోగ్య పరిరక్షణ, దీర్ఘాయువుకు ఇవి చాల అవసరం.

కనిపించినవన్నీ తింటున్నాం.. కావాల్సినంతే తింటున్నాం. మన ఆరోగ్యానికి ఏం 'తక్కువ'! అని బిందాస్‌గా ఉంటారు అనేకమంది. కానీ 'తక్కువ' మొత్తంలో తీసుకోవాల్సినవి ఆరోగ్యంలో అతి కీలకమైనవి అయిన మైక్రోన్యూట్రియంట్లని చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. పసి పిల్లలకు, గర్భిణులకు ఎంతో అవసరం అయిన ఆ మైక్రో నూట్రియంట్ల ప్రాధాన్యం గురించి. విటమిన్లు, ఖనిజ లవణాలనే మైక్రోన్యూటియంట్లు అంటాం. మన వాతావరణానికి ముఖ్యంగా కావాల్సిన మైక్రోన్యూట్రియంట్లు ఇనుము, జింకు, అయోడిన్‌, కాల్షియం, విటమిన్‌ఎ, విటమిన్‌సి. మైక్రోన్యూట్రియంట్లలోని.. కీలకమైన ఖనిజ లవణాలు, విటమిన్లు అధిక మోతాదులో శరీరానికి అవసరం లేదు. కానీ ప్రధానమైనవి కొద్ది కొద్దిగా అందితే సరిపోతుంది. ఎదిగే పిల్లలకు ఈ మైక్రోన్యూట్రియంట్లు చాలా అవసరం. చిన్నారులు, కౌమార దశలోని అమ్మాయిల్లో ఎదుగుదల చాలా వేగంగా ఉంటుంది. వారికి తగిన మొత్తంలో విటమిన్లు, ఖనిజ లవణాలు లభించనప్పుడు చురుకుదనం లోపిస్తుంది. నీరసానికి లోనవుతారు. ఇదే దీర్ఘకాలం కొనసాగితే రక్తహీనత వంటి సమస్యలతో బాధపడతారు.

ఆరోగ్యానికి ఇవన్నీ...
నిత్యం తీసుకొనే ఆహారంలో ప్రధానంగా అన్ని రకాల ఆహార పదార్థాలు ఉండేలా జాగ్రత్తపడాలి. రాగులు, సజ్జలు, జొన్నలు, గోధుమలు, దంపుడు బియ్యం వంటి గింజ, తృణ ధాన్యాలకు ప్రాధాన్యమివ్వాలి. తాజాగా ఉండే ఏ పండ్లనయినా నిత్యం తీసుకుంటూ ఉండటం చాలా అవసరం. అలాగే మాంసకృత్తులు ఉండే ఆహారం తీసుకోవాలి. ఇందులోకి గుడ్డు చేప, చికెన్‌ వస్తాయి. అవి తినని వారు పాలు, పనీర్‌, చీజ్‌ వంటివి ఎంచుకోవచ్చు. వీటినుంచి శరీర అవసరాలకు సరిపడే కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజ లవణాలు అందుతాయి. అన్నింటిని కొంచెం కొంచెం చేర్చుకొన్నా శరీరానికి ఏ లోపాలు ఉండవు.
మైక్రోన్యూట్రియంట్లలోని.. కీలకమైన ఖనిజ లవణాలు, విటమిన్లు అధిక మోతాదులో శరీరానికి అవసరం లేదు. కానీ ప్రధానమైనవి కొద్ది కొద్దిగా అందితే సరిపోతుంది.

ఉపయోగాలు :

  • ఆరోగ్యంగా ఉండటానికి,
  • రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి,
  • రక్తహీనత రాకుండా ఉండడానికి ,
  • మధుమేహం వంటి వ్యాధులు అదుపులో ఉండడానికి ,

కొన్ని ముఖ్యమైన మైక్రోన్యూట్రియంట్స్ (ఖనిజ లవనాలు +విటమిన్లు )-- జింక్‌,ఇనుము , అయోడిన్ , అయోడిన్ , క్యాల్షియం , విటమిన్‌-ఎ, విటమిన్‌ - సి
------------
జింక్‌:
జింక్ లబించే ఆహారపదార్హాలు -> ధాన్యం, పన్నీర్‌, వేరుశనగ గింజలు ఎండుకొబ్బరి, బాదం, ఆవాలు, రాజ్‌మా బుట్టమిర్చి, పొట్టుతో ఉన్న సెనగలు, సజ్జలు, గుడ్డు పచ్చసొన, చిక్కుడు గింజలు,
పాలకూర, .......................మొదలైన వాటిలో జింక్‌ లభిస్తుంది. మొలకెత్తిన గింజలైతే మరీ శ్రేష్టం.

ఉపయోగము :
రోగనిరోధక శక్తికి జింక్‌ బాగా ఉపయోగపడుతుంది.

ఇనుము :
ఇనుము లబించే ఆహారపదార్హాలు -> గోధుమ, సజ్జ, రాగులు, వేయించిన సెనగలు, అలసందలు, తోటకూర, వీటిలో ఇనుము అధికంగా ఉంటుంది. పప్పుదినుసులు, జీడిపప్పు (తక్కువమోతాదులో), గుడ్డులోని పచ్చసొన, తాజా ఆకుకూరలు, చిక్కుడు గింజలు, పాల ఉత్పత్తులు, సోయాబీన్స్‌, పొట్టుతో ఉన్న గింజ ధాన్యాలు, తృణధాన్యాల్లో కూడా ఉంటుంది.

ఉపయోగము :
రక్తం వృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది.

అయోడిన్‌:
అయోడిన్ లబించే ఆహారపదార్హాలు -> అయొడైజ్డ్‌ చేసిన ఉప్ప, కల్లుప్పు, కాడ్‌లివర్‌ నూనె, వెల్లుల్లి, పుట్టగొడుగులు, పులస చేప, సముద్ర ఆహారం.

ఉపయోగము :
ఇది ప్రధానంగా థైరాయిడ్‌ గ్రంథిని నియంత్రణలో ఉంచుతుంది.

క్యాల్షియం:
లబించే ఆహారపదార్హాలు -బాదం, బ్రకోలీ, క్యాబేజీ, చీజ్‌, పాల ఉత్పత్తులు, తాజా ఆకుకూరలు, ఓట్లు, సోయాబీన్స్‌ నుంచి లభిస్తుంది.

ఉపయోగము :
ఎముకల పటుత్వానికి, నరాలు చురుగ్గా పనిచేయడానికి ఇది ఉపకరిస్తుంది.

విటమిన్‌ ఎ:

        కంటి చూపును సవ్యంగా ఉంచడంలో విటమిన్  ఎ పాత్ర ముఖ్యమైనది. వ్యాధి నిరోధక చర్యలు, చర్మ దృఢత్వానికి ఇది దోహదం చేస్తుంది. ఇది కొవ్వులో కరిగే విటమిన్. మన దేశంలో మూడు శాతం మంది పిల్లలు విటమిన్ ఎ లోపం కారణంగా కంటిలో బిటాట్ స్పాట్ (తెల్లని కనుగుడ్డుపై నల్లటి మచ్చ) తో బాధ పడుతున్నారు. విటమిన్ ఎ లోపం తొలిదశ లక్షణాల్లో రేచీకటి మొదటిది.
        విటమిన్ ఎ ప్రాముఖ్యత   :

            సాధారణ కంటిచూపునకు విటమిన్ - ఎ అత్యవసరం. ఇది లోపిస్తే రేచీకటి, ఇతర చిక్కులకు దారితీస్తుంది.
            మహిళలు గర్భవతులుగా ఉన్నప్ఫుడు, అంతకన్నాముందు కూడా విటమిన్ ఎ లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా కానుపు సమయంలో ఎదురయ్యే వ్యాధులను,మృత్యువు ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ఒక అధ్యయనంలో తేలింది.
            విటమిన్ ఎ పుష్కలంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకోవడం ద్వార ఈ లోపాన్ని నివారించవచ్చు.

        విటమిన్ ఎ ఎక్కువగా ఉండే అహార పదార్ధాలు :

            ఆకుకూరలు, పసుపురంగు, నారింజ పండ్లు, కాయగూరల్లో బీటా-కెరోటిన్ (విటమిన్ ఎ మూలకం) సమృద్ధిగా ఉంటుంది.
            బీటా-కెరోటిన్ విటమిన్ ఎ గా మారుతుంది. ముఖ్యంగా మంసాహారంలోనే ఇది లభిస్తుంది.
            పాలు, పాలతో చేసే పదార్ధాలు, గుడ్డులోని పచ్చని సొన, ఎర్రపామాయిల్, చేపలు, చేపనూనెల్లో కూడా విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.

        వివిధ ఆహార పదార్ధాలలో బీటా-కెరోటిన్ పరిమాణం


ఆహార పదార్ధం పేరు
ప్రతి 100 గ్రాముల్లో లభించే బీటా కెరోటిన్ (మై.గ్రాములు)
కొత్తిమీర
4800
కరివేపాకు
7110
మునగాకు
19690
మెంతికూర
9100
క్యారట్టు
6460
మామిడి పండు
1990
బొప్పాయి పండు
880

  గుమ్మడికాయ  1160



విటమిన్‌ సి :

    శరీర ఆరోగ్యానికి ప్రధానమైన సూక్ష్మ పోషకాల్లో విటమిన్ - సి ఒకటి. ఇది యాంటీ- ఆక్సిడెంట్ గుణం కలది. విటమిన్ సి లోపించినవారు స్కర్వి వ్యాధికి లోనవుతారు. ఈ వ్యాధి గలవారు శరీరమంతా నీరసంతో, పంటి చిగుళ్ళ నుంచి రక్తం కారుతూ, ఎముకల ఎదుగుదల లేక బాధ పడతారు. గాయాలను మానపటానికి కొన్ని రకాల హార్మోన్ల మేళవింపునకు విటమిన్ సి సహాయపడుతుంది. అమినో యాసిడ్, కార్బో హైడ్రేట్లు (పిండిపదార్ధాలు) జైవికక్రియకు, అహారంలోని ఇనుముధాతువు శరీరంలో ఇమిడిపోవడానికి కూడా తోడ్పడుతుంది.
    విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారపదార్ధాలు :-నారింజ, ఉసిరి, నిమ్మకాయ లాంటి పులుపు పండ్లు అన్నిటిలోను విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మనం సాధారణంగా తీసుకొనే టమాటా, జామపండ్లు మొలకెత్తిన పప్పు ధాన్యాలు కూడా విటమిన్ సి ని పుష్కలంగా అందిస్తాయి.

ఉపయోగము :
రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలు త్వరగా మానడానికి విటమిన్‌ సిను ఇస్తారు.
  • ======================================
Visit my website - > Dr.Seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is very important to improve the Web blog.